భద్రాచలం, డిసెంబర్ 17 : జిల్లాలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శనివారం ధనుర్మాస ఆరంభ పూజలు ఘనంగా జరిపారు. ఉదయం అర్చకులు సుప్రభాత సేవ నిర్వహించి, బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు. క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేసి వైష్ణవ సంప్రదాయం ప్రకారం కల్యాణ క్రతువు నిర్వహించారు. కల్యాణ మండపం రోడ్డులో కొలువైన శ్రీకృష్ణాలయంలో తిరుప్పావై ప్రవచనం జరిగింది. నేడు రామాలయంలో ఆండాళ్లమ్మకు ప్రత్యేక పూజలు ఉంటాయని, తిరువీధి సేవ ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. 19 నుంచి అధ్యయనోత్సవాలు నిర్వహిస్తామని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు వెల్లడించారు.