రాకపోకలను అడ్డుకున్న ఆదివాసీలు

SMTV Desk 2017-12-16 16:22:17  medaram jathara, minister chandulal, st candidates, pasra, tadvai news.

భూపాలపల్లి, డిసెంబర్ 16 : మేడారం జాతర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గందరగోళ వాతావరణం నెలకొంది. జాతర కమిటీ నుండి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. జాతర నిమిత్తం జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సైతం అడ్డుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన మంత్రి చందూలాల్ కుమారుడి వాహనాన్ని ఇటీవల ఆదివాసీలు ధ్వంసం చేశారు. ఇదిలా ఉండగా ఈరోజు తెల్లవారు జామున పస్రా-తాడ్వాయి మార్గ మధ్యంలో చెట్లను నరికి రోడ్లపై వేసి రాకపోకలను అడ్డుకున్నారు. మరో 15 వాహనాలను సైతం ఆదివాసీలు ధ్వంసం చేశారు.