మాదాపూర్, డిసెంబర్ 16 : మాదాపూర్ పరిధిలోని ఎన్సీసీ భవనంలో ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ మరమత్తు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు క్రింద పడి మృతి చెందారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా మృతులను నాగరాజు, శ్రీనుగా గుర్తించారు. మరింత సమాచారం కోసం పోలీసులు భవనంలో స్థానికుల నుండి వివరాలు సేకరిస్తున్నారు.