వనిత పై బిగిస్తున్న ఉచ్చు

SMTV Desk 2017-12-15 10:32:37  vanitha, vijay sai wife, comedian, tollywood

హైదరాబాద్, డిసెంబర్ 15 : తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సాయి ఆత్మహత్య కేసులో నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 11న వ్యక్తిగత కారణాల వల్ల యూసుఫ్‌గూడలోని తన సొంత నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన చనిపోయే ముందు తన మృతికి భార్య వనితతో పాటు, న్యాయవాది శ్రీనివాస్‌, శశిధర్‌ కారణం అంటూ ఒక వీడియోలో స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు. అయితే వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆమె నివాసానికి వెళ్లగా, ఆ సమయంలో ఆమె తల్లి ఉంది. వనిత గురించి పోలీసులు విచారించగా తాను సూర్యాపేటలో ఉన్నట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. కాగా విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోకపోవడంపై అతని తండ్రి సుబ్బారావు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.