హైదరాబాద్, డిసెంబర్ 13 : ప్రపంచ తెలుగు మహా సభలకు సర్వం సిద్దమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. గవర్నర్ ను ఆహ్వానిస్తూ కరదీపికను అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్.. తొలిసారిగా నిర్వహిస్తున్న మహాసభలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం దేశ విదేశాల నుండి దాదాపు వేయి మందికి పైగా కవులు, మూడు వేల మందికి పైగా రచయితలు, చరిత్రకారులు, సాహిత్య, భాషాభిమానులు హాజరవుతున్నారని వెల్లడించారు. ఈ సభలకు కుటుంబ సమేతంగా హాజరు కావాలని సీఎం గవర్నర్ను కోరారు. గవర్నర్ పలు సూచనలు చేయగా వాటిని అనుసరిస్తామన్నారు. కాగా ఈ సభలకు అన్ని జిల్లాల ప్రజలు హాజరయ్యేందుకు 550 ప్రత్యేక బస్సులను కేటాయించాలని ప్రభుత్వం రవాణాశాఖను ఆదేశించింది.