కరీంనగర్, డిసెంబర్ 12 : సాధారణ మార్గం గుండా వెళ్ళమన్న౦దుకు టోల్ప్లాజా సిబ్బందిపై ఓ ఎమ్యెల్యే దాడి చేసిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. వీఐపీలు వెళ్లే మార్గంలో ఓ వాహనం సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. తన కారులో చొప్పదండి ప్రాంతం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎమ్మెల్యే బొడిగె శోభ తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట టోల్గేట్ వద్దకు రాగానే, టోల్ ప్లాజా సిబ్బంది సాధారణ ప్రయాణికుల మార్గంలో వెళ్లాలని సూచించారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే శోభ వారిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై గన్మెన్లు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై టోల్ సిబ్బంది ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించగా, ఏసీపీ ఉషారాణి సిబ్బందితో సహా అక్కడికి చేరుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరణ ఇవ్వనుండగా ఏదో ఫోన్ వచ్చి అక్కడి నుండి ఆమె వెళ్ళిపోవడం గమనార్హం.