హైదరాబాద్, డిసెంబర్ 11 : సీపీఎం నాయకులు బేగంపేటలోని మెట్రోరైల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. నగరంలోని ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా మార్గంలో మెట్రోరైల్ నిర్మాణాన్ని వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఒక మార్గంలో మెట్రోరైలు పనులు త్వరగా పూర్తయ్యాయి. మరో మార్గంలో ఎందుకు ఆలస్యం అవుతున్నాయి.? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే ఛార్జీలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన నిర్వహించారు. మెట్రో రైలు మార్గాలను త్వరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని పలువురు నాయకులు పేర్కొన్నారు.