హైదరాబాద్, డిసెంబర్ 10 : నగరంలోని దిల్సుఖ్నగర్ చైతన్య పురిలో నిరుద్యోగ మహాగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశాడు. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోతే పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ చేయకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నించారు.