రెండు రోజులకోసారి మెట్రోరైల్‌ స్టేషన్‌లో తనిఖీలు

SMTV Desk 2017-12-09 17:39:19  Metrorail station, Dog squad, bombsquad checks, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 09 ‌: రాజధానిలో ఇటీవలే ప్రారంభమైన మెట్రో రైలు స్టేషన్‌లలో నేడు డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానంతో కనిపించే వారిని ఎలా గుర్తించాలనే అంశంపై మెట్రో భద్రతా సిబ్బందికి విపులంగా వివరించారు. అనుమానితులను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తార్నాక నుంచి హబ్సిగూడ వరకు మెట్రో రైల్‌లో ప్రయాణించిన బాంబ్‌స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. ప్రతి రెండు రోజులకోసారి తనిఖీలు నిర్వహించనున్నట్టు ఈస్ట్‌జోన్‌ బాంబుస్క్వాడ్‌ ఇంఛార్జి దయానంద్‌ వెల్లడించారు.