హైదరాబాద్, డిసెంబర్ 07: లోటు విద్యుత్ ఉన్న తెలంగాణ రాష్ట్ర౦ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదీక్ష, పట్టుదలే కారణమని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. న్యూ డిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అధ్యక్షతన జరుగుతున్న పవర్, నూతన ఉత్పాదక సదస్సులో మంత్రి జగదీష్రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణాలో డిమాండ్ కు తగ్గ విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అనేక విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నదని, ఇవి పూర్తి అయితే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని ఆయన తెలిపారు. జనవరి 1నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తున్నట్లు, ప్రస్తుతం పగటిపూట 9గంటలు వ్యవసాయానికి విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సదస్సులో పునరుత్పాదక విద్యుత్, విద్యుత్ తయారీ ప్రధాన అంశాలుగా చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు.