మెట్రో ప్రయాణికులకు శుభవార్త..!

SMTV Desk 2017-12-07 10:15:39  Metro smart card, 10 percent discount, l and t officers.

హైదరాబాద్, డిసెంబర్ 07 : మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇక నుండి మెట్రో స్మార్ట్‌కార్డుతో ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ లభించనుందని ఎల్‌అండ్‌టీ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కార్డుపై 5% రాయితీ మాత్రమే లభిస్తుండగా, తాజాగా ఇప్పుడు ఛార్జీలో 10% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ కార్డు ఏడాదిపాటు చెల్లుబాటవుతుంది. ఈ ప్రక్రియలో ముందుగా రూ.200 చెల్లించి స్మార్ట్‌ కార్డును కొనుగోలు చేయాలి. అందులో గరిష్ఠంగా రూ.3వేల వరకు రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ప్రతి మెట్రో స్టేషన్ వద్ద ఈ కార్డు అందుబాటులో ఉంది.