న్యూఢిల్లీ, డిసెంబర్ 06 : దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి(ఎన్సీటీఈ).. తమ కార్యకలాపాల వివరాలు వెల్లడిస్తూ అఫిడవిట్ సమర్పించమని పలుమార్లు హెచ్చరించింది. కానివెయ్యి సంస్థలు ఎంతకు స్పందించకపోవడంతో తక్షణమే ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను మూసేయాలని ఎన్సీటీఈ ఆదేశించింది. అలాగే వాటితో పాటు మరో 3 వేల సంస్థలను పరిశీలనలో పెట్టినట్లు తెలుస్తోంది. వాటిని కూడా మార్చిలో మూసివేయాలని ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.