హైదరాబాద్, డిసెంబర్ 06 : "బ్లాక్ డే" సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బాబ్రీ మసీదు విధ్వంస దినం సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే పాతబస్తీలో ఎక్కువ అల్లర్లు జరగనున్న నేపథ్యంలో అక్కడ సుమారు 3000 మంది పోలీసులతో భారీ బలగాలను మోహరించారు. కాగా ఈ 144 సెక్షన్ రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.