ప్రాణం తీసిన ప్రేమ

SMTV Desk 2017-12-05 19:12:12  chatinyapuri, suicide, geetha krishna, victim,

హైదరాబాద్, డిసెంబర్ 05 : ప్రేమించిన యువకుడు చేసిన మోసాన్ని భరించలేక ఓ యువతి చైతన్యపురిలోని వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాల జిల్లాకు చెందిన గీతా కృష్ణ అనే దంత వైద్యురాలు మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. నరేశ్‌ అనే యువకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అది భరించలేక తను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వసతి గృహం నుండి మృతదేహాన్ని కిందికి దించారు. హాస్టల్ లో గల సహచరుల నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.