జక్కన్న మాట నిలబెట్టుకుంటారా...?

SMTV Desk 2017-12-05 18:41:09  rajamouli, ntr, ramcharan, multistarer, tollywood

హైదరాబాద్, డిసెంబర్ 05 : దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి-2 తర్వాత ఎలాంటి చిత్రం చేస్తారని చాలామంది సినీ ప్రేమికులు చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు. అందరి అంచనాలుకు తగ్గట్టు జక్కన్న రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజమౌళి తన ట్విటర్‌ ఖాతాలో చరణ్‌, తారక్‌తో కలిసి దిగిన ఫొటో పోస్ట్‌ చేయగానే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా అంతర్జాల వేదికగా ఈ సినిమాకి ‘యమధీర’ అనే టైటిల్ అయితే బాగుంటుదని అభిమానులు చెప్తున్నారు. ఈ చిత్రం కోసం రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారని, ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్‌ను వాడటంలేదని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘బాహుబలి’ చిత్రాల విడుదల ఆలస్యానికి ప్రధాన కారణాల్లో గ్రాఫిక్స్‌ కూడా ఒకటి. దీని వల్ల తన తదుపరి చిత్రం వీఎఫ్‌ఎక్స్‌తో లేకుండా చేస్తానని ఇంతక ముందు ప్రకటించారు. క్రీడా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.