తొలిసారిగా గీతంలో "డ్యూయెల్‌ పీజీ"

SMTV Desk 2017-12-03 16:43:13  gitam university, dual pg, ceo anuradha thota,

హైదరాబాద్, డిసెంబర్ 03 : సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా గీతం విశ్వవిద్యాలయంలో డ్యూయెల్‌ పీజీ కోర్సును ప్రవేశపెట్టినట్లు ఆ కోర్సు సీఈఓ అనూరాధ తోట తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా అందుబాటులోకి ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ, డ్యూయెల్‌ పోస్టు గ్యాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనే రెండు కోర్సులను ప్రారంభించారు. 18 నెలల పాటు జరిగే ఈ కోర్సులో ప్రతి శనివారం తరగతులు ఉంటాయని, మొదటి బ్యాచ్‌ ఇప్పటికే ప్రారంభం కాగా రెండో బ్యాచ్‌ ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందని వెల్లడించారు. మరింత సమాచారం కోసం contact@emc2india.com అనే వెబ్‌సైట్‌ లో చూడవలసి౦దిగా తెలిపారు.