నస్రుల్లాబాద్, డిసెంబర్ 02 : ఎంతో మందికి నృత్యంలో మెళుకువలను నేర్పించి, చిత్ర పరిశ్రమకు అందించిన ప్రముఖ నృత్య దర్శకుడు ధర్మరాజు (97) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు గాంచిన ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా ఇతని శిష్యుడే. అతని మరణ వార్త విని ప్రభుదేవా చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. సినిమా మీద మక్కువతో ధర్మరాజు తన 20వ ఏట నుంచే బీవీ నరసింహరావు వద్ద నృత్య కారుడిగా శిక్షణ తీసుకున్నారు. చెన్నైలో స్థిర పడిన ఆయన ఆనాటి పాత తరం నటులు నుండి ఇప్పటి యంగ్ హీరోల వరకు చాలామందికి క్లాసికల్ డ్యాన్సర్గా వ్యవహరించారు. ధర్మరాజు మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసింది.