హైదరాబాద్, డిసెంబర్ : ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్కు ఓ లేఖ రాసినట్లు తెలిపారు. ఈ లేఖలో.. "ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన మీరు చూసినవన్ని వాస్తవాలు కాదు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అవమానాల గురించి మీరు తెలుసుకోవాలి" అని ఇవాంకాను కోరినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన జీఈఎస్ సదస్సులో మొత్తం కేటీఆర్ షోనే నడిచిందన్నారు. నిజానికి ప్రొటోకాల్ ప్రకారం ఇవాంకకు మేయర్ ఆహ్వానం పలకాలి కాని అక్కడ అలా జరగలేదని ఆరోపించారు.