నేడు గోల్కొండ కోట వైపు ట్రాఫిక్ ఆంక్షలు..

SMTV Desk 2017-11-29 11:05:21  golkonda fort, avoid traffic, telangana govt, traffic joint cp.

హైదరాబాద్, నవంబర్ 29 : గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ (జీఈఎస్) కు విచ్చేసిన వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలో వి౦దును ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గోల్కొండ వైపు ప్రయాణించే దారిలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. అతిధులు ప్రయాణించే దారి కావడంతో ట్రాఫిక్ ను మళ్ళించాల్సి వస్తుందని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. కాగా నార్సింగి, రాందేవ్ గూడ నుండి గోల్కొండ వైపు వెళ్ళే వాహనాలు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ కింద నుండి ఎడమవైపుగా ఫతేదర్వాజా గోల్కొండ పోర్టు వైపు వెళ్లాలని సూచించారు.