హైదరాబాద్, నవంబర్ 28 : హైదరాబాద్ వాసులు ఏళ్ల తరబడి ఎదురు చూసిన మెట్రో రైలును ప్రధాని మోదీ, ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కాసేపు తెలంగాణ సీఎం కేసీఆర్ , గవర్నర్ నరసింహన్ తో కలిసి మెట్రోరైల్లో ప్రయాణించారు. రేపు ఉదయం నుంచి హైదరాబాదీయులు మెట్రోరైల్ సేవలను ఉపయోగించుకోవచ్చు. హెచ్ఐసీసీకి వెళ్లిన మోదీ మొదట ఇవాంక ట్రంప్తో సుమారు 20 నిమిషాల పాటు సమావేశం అవుతారు. అనంతరం సదస్సును ప్రారంభిస్తారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించడమే ప్రధానంగా ఈ సదస్సు జరగనుంది. కాగా, తొలిదశలో హైదరాబాద్ మెట్రోరైల్ 30 కిలోమీటర్ల మేర పరుగులు తీయనుంది.