హైదరాబాద్, నవంబర్ 28 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బస చేస్తున్నట్రైడెంట్ హోటల్లో తనను పలకరిస్తున్న వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా మాటలు కలుపుతున్నారు. నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ఇవాంకాకు అమెరికా రాయబారి కెనెట్, కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ స్వాగతం పలికారు. ఆపై హోటల్ వద్ద స్థానిక అధికారులను, హోటల్ మేనేజ్ మెంట్ ను పరిచయం చేస్తుండగా, వారితో ఇవాంకా మాట్లాడారు. ఉదయం కాసేపు విశ్రాంతి తీసుకుని స్వల్పంగా అల్పాహారం స్వీకరించినట్టు సమాచారం. అప్పుడు కూడా తనకు కనిపించిన ప్రతి వారినీ అమె పలకరిస్తూనే ఉన్నారని హోటల్ వర్గాలు వెల్లడించాయి. మరికాసేపట్లో ఆమె హెచ్ఐసీసీ చేరుకునే అవకాశాలు ఉన్నాయిని సమాచారం. ఇవాంక రాక సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.