హైదరాబాద్, నవంబర్ 19 : ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఉద్యోగిని పట్ల ఐదుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు ఓ మహిళా ఉద్యోగినిని వేధించారు. దీంతో బాధితురాలు ధైర్యం చేసి సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల వద్దకు వెళ్లి సాయం కోరింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. కాగా ఆ నిందితులు బంజారాహిల్స్, అమీర్పేట, శ్రీనగర్ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు.