త్వరలోనే పార్టీ పెడతా : కోదండరాం

SMTV Desk 2017-11-13 15:01:00  tjac chairman professor kodandaram, new party establish news viral.

హైదరాబాద్, నవంబర్ 13 : టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ కార్యవర్గం, అజెండా సంబంధిత విషయాలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ ప్రారంభించాక కాంగ్రెస్ తో కలిసి కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు, అలాగే సీపీఐ(ఏంఎల్-న్యూడెమోక్రసీ) లను కూడా కలుపుకోనున్నట్లు తెలుస్తోంది. "టీ మాస్" కూడా కొదండతో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేసిందని కాంగ్రెస్ ను తప్పిస్తే కూటమిలో చేరతానని ప్రతిపాదన పంపిందని సమాచారం. ఈ సందర్భంగా ఘట్ కేసర్ లో జరిగిన స్టీరింగ్ సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ.. " నిర్మాణం లేకుండా ఏదీ సాధ్యం కాదు, ముందు కమిటీలు పూర్తి చేయండి. తర్వాత నేను పార్టీ పెడతా. సంవత్సరం అయింది. ఇప్పటికి నాలుగు కమిటీలు మాత్రమే పూర్తయ్యాయి" అని వ్యాఖ్యానించారు.