హైదరాబాద్, నవంబర్ 12 : ఈ నెల 28న హెచ్ఐసీసీ(హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్)లో జరగనున్న జీఈఎస్(గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్) సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ దేశానికి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం అలంకారంతో ముస్తాబవుతోంది. కాగా, 26న గచ్చిబౌలి స్టేడియంలో జరగబోయే ఏ.ఆర్ రెహమాన్ కచేరీ కార్యక్రమానికి ఇవాంక కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆమెతో పాటు దేశ ప్రధాని మోదీ కూడా వెళ్లనున్నారట. హైదరాబాద్లోని రహేజా మైండ్ స్పేస్లోని హోటల్లో ఇవాంక బస చేయనున్నారు. ఫలక్నుమా ప్యాలెస్లో ఆమె కోసం విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవాంకా ట్రంప్ తొలిసారిగా హైదరాబాద్ కు రాబోతున్న సందర్భంగా పర్యాటక ప్రాంతాలను విక్షించనున్నారు.