హైదరాబాద్, నవంబర్ 12 : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి తెలంగాణ డీజీపీగా నేడు బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ తొలి డీజీపీగా పని చేసిన అనురాగ్ శర్మ పదవి విరమణ నేపథ్యంలో ఆ బాధ్యతలను మహేందర్ రెడ్డి స్వీకరించారు. అన౦తరం ఆయన మాట్లాడుతూ.. "డీజీపీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, శాంతి, భద్రతలు కాపాడే౦దుకు అందరం భాగాస్వాములమవుదాం. ప్రభుత్వం పోలీసు శాఖకు ప్రాధాన్యం ఇస్తోంది. అందుకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలిసింగ్ కు ప్రాధాన్యతనిస్తాను. అందరి సహకారంతో ముందుకు వెళ్తాను" అని తెలిపారు. అనురాగ్ శర్మకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కవాతు, పరేడ్ లతో పోలీసులు ఘనమైన వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.