హైదరాబాద్, నవంబర్ 12 : ఆయన ఇంట్లో నుంచి సినిమా సెట్ కు రావాలంటే లక్ష రూపాయలు పారితోషికం తీసుకుంటున్నడ౦ట. ఆయన ఎవరో కాదండి.. చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు దగ్గరైన నటుడు పోసాని కృష్ణ మురళి. ఇటు వెండితెరపైన కీలక పాత్రలు పోషిస్తూ, అటు బుల్లి తెరపైన వ్యాఖ్యాతగా అలరిస్తున్నాడు. ఆయన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ... " ఒకప్పుడు సినిమాలు తీసి చేతులు కాల్చుకుని నిండా అప్పుల్లో మునిగిపోయినప్పుడు వీరంతా ఏమయ్యా రు. ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు అని అంటున్నారు కదా.. అది నిజమే. ఆస్తులు అమ్ముకుని కష్టాలపాలైనప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. అప్పుడు స్పందించని వీరంతా ఇప్పుడు మాత్రం పోసాని కృష్ణ మురళి ఇంత డబ్బు తీసుకుంటాడనడం సరికాదు. ప్రస్తుతం పని చెయ్యకపోయినా కూర్చుని తినేంత ఆస్తిని, ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకు నేను రుణ పడి ఉంటానని" చెప్పుకొచ్చారు.