తగ్గిన గొర్రెల లభ్యత.. నిబంధనలు సవరించండి..

SMTV Desk 2017-11-09 18:44:43  sheeps problem, veterinary doctors, hyderabad, minister talasani srinivas yadav

హైదరాబాద్, నవంబర్ 09 : ప్రభుత్వం సూచించిన యూనిట్ ధర(రూ.1.25 లక్షలు) కు నియమాలలో ఉన్న విధంగా వయుసున్న21 గొర్రెలు దొరకడంలేదని, ప్రభుత్వం నియమాలు సవరించాలని పశు వైద్యాధికారులు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు విజ్ఞప్తి చేశారు. సాధారణంగా గొర్రెలు ఆరేడేళ్ల వరకు ఈనుతాయి. కాబట్టి రెండేళ్ల పైన వయుసున్నవాటినీ అనుమతించండి అంటూ మంత్రిని కోరారు. బుధవారం సచివాలయంలో మంత్రి తలసాని పశు వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గొర్రెల కొనుగోళ్లలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైద్యాధికారులు మంత్రికి విన్నవించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.