యువతిని వేధిస్తున్న యువకుడు

SMTV Desk 2017-06-09 18:38:47  girls, teasing, boys

నాగోల్, జూన్ 09 : ఈ రోజుల్లో అమ్మాయిలు వేధింపులకు ఎక్కువ గా గురి కావడం జరుగుతుంది. ఇలాంటి వేధింపుల సంఘటనే నాగోల్ లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మల్కాజ్ గిరిలో నివాసం ఉండే భరద్వాజ్ (23) బీటెక్ విద్యార్థి. ఇతనికి రెండేళ్ళ నుంచి నాగోల్ బండ్లగుడలో నివసించే బంధువైన ఓ యువతి (20) ఆమెతో పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయినప్పటి నుండి బాగానే మాట్లాడిన భరద్వాజ్ ఈ మధ్య కాలంలో అతని ప్రవర్తన మార్పు రావడంతో అప్పటి నుండి ఆ యువతి అతనితో మాట్లాడటం మానేసింది. అయిన భరద్వాజ్ నేను నిన్ను ప్రేమిస్తున్న మనం పెళ్లి చేసుకుందాం అంటూ ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి ఈ నెల 5 న తెల్లవారుజామున 3 గంటలకు భరద్వాజ్ తన తల్లి ఓరుగంటి నాగకుమారి, సోదరి ఎం. రూపశ్రీ తో కలిసి వచ్చి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. దీంతో ఆ యువతి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు భరద్వాజ్ పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.