విజయవాడ, నవంబర్ 04: రీల్ లైఫ్ లో స్టార్ హీరో, హీరోయిన్ లుగా చలామణి అయ్యే నటుల విషయ౦లో రియల్ లైఫ్ కి వచ్చేసరికి ఎంతో కొంత తేడా కనపడుతూ ఉంటుంది. కొందరు సేవ చేయడం ఇష్టపడితే మరికొందరు దానికి భిన్నంగా ఉంటారు. అలా సేవా గుణం ఉన్న నటులను మనం వేళ్లపైన లెక్కించవచ్చు. ఆ కోవకు చెందిన కొంతమంది నటుల్లో అక్కినేని కోడలు సమంత ఒకరు. ఆమె “ప్రత్యూష ఫౌండేషన్” ను స్థాపించి, సామాన్యులతో మమేకమవుతూ వారి కష్ట సుఖాల్లో భాగస్వామ్యమౌతున్నారు. తాజాగా తమ సంస్థ ద్వారా విజయవాడలో 15మంది శిశువులకు గుండెకు సంబంధించిన ఆపరేషన్లు చేయించి వారికి ప్రాణదాతగా మారారు. ఆ చిన్నారుల ఫోటోలను ట్విట్టర్లో అప్లోడ్ చేసిన సమంత "మరో గుండె సంబంధిత ఫ్రీ శస్త్ర చికిత్సల క్యాంప్ను విజయవాడ, ఆంధ్రా హాస్పిటల్స్లో నిర్వహించాం. 15మంది లవ్లీ కిడ్స్కి ఈ ఆపరేషన్లు జరిగాయి. ఇప్పుడు వారంతా హెల్దీ హార్ట్స్తో ఉన్నారు" అంటూ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు నుండి ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.