హైదరాబాద్, నవంబర్ 03 : తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేప్పట్టిన పథకాలన్నీ పాతవేనని వాటి పేర్లు మార్చి తిరిగి వాటిని అమలు పరిచారని కాంగ్రెస్ నేత గీతారెడ్డి విమర్శించారు. కేసీఆర్ కిట్ల పథకంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చలో గీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు అమలవుతున్న పథకాలన్నీ పాతవేనని, పేర్లు మాత్రమే మారుస్తున్నారని విమర్శించారు. నేడు అమలవుతున్న ఆరోగ్య లక్ష్మి పథకం పాతదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులతోపాటు సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉందని గీతారెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనూ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన పథకమే నేటి ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన అని వివరించారు.