హైదరాబాద్, నవంబర్ 02 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభ, మండలిలో ప్రకృతి గురించి ప్రసంగిస్తూ ప్రకృతిని పూజించి, పండుగలు జరిపే రాష్ట్రం మనదన్నారు. పర్యాటక రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధికి నిధుల లోటు లేదని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ దర్శన్ కింద రాష్ట్రం మూడు ప్రాజెక్టులను దక్కించుకుందని ఈటల తెలిపారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.