ఈ సినిమాకు అనుపమ హైలైట్ : కిషోర్

SMTV Desk 2017-10-20 17:39:44  RAM, ANUPAMA PARAMESHWARAN, LAVANYA TRIPATHI, VUNNADHI OKATE JINDAGI, TIRUMALA KISHORE

హైదరాబాద్, అక్టోబర్ 20: రామ్ కథానాయకుడిగా, తిరుమల కిషోర్ దర్శకత్వంలో ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ సరసన కథానాయికలుగా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ... ‘ ఈ సినిమాలో రామ్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ కట్టి పడేస్తుంది. తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తన పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ‘ ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.