న్యూఢిల్లీ, అక్టోబర్ 17 : దేశవ్యాప్తంగా నేడు ధన త్రయోదశి కావడంతో బంగారం మార్కెట్లు పలు విధాల ఆభరణాల అలంకారాలతో మస్తాబైన్నాయి. పత్రి సంవత్సరం దీపావళికి ఒక్కరోజు ముందుగా వచ్చే ఈ పండుగకు కొత్త ఆభరణాలు కొనులుచేసేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా కొన్ని ఏళ్ల ఆచారంగా వస్తున్న ఈ పర్వదినాన బంగార ఆభరణాలు చాలా వరకు కొనుగోలు చేస్తూవుంటారు. దీంతో ఈ రోజున బంగారాన్ని అధిక సంఖ్య వినియోగదారులు వచ్చి గీరాకి చేయడం విశేషం. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన పేటీఎం, అమెజాన్, వినియోగ దారులకి పలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించడం జరిగింది.