ఖమ్మం, అక్టోబర్ 16 : ప్రపంచం అభివృద్ధి వైపు సాగుతున్నా, ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలతో గడిపేస్తున్నారు. దీనికి ఉదాహరణగా... ఓ జ్యోతిషుడు చెప్పిన మాటలు విని గ్రామ ప్రజలందరూ ఒక రోజంతా అడవి బాట పట్టిన సంఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. గత మూడు నెలల్లో ఐదుగురు కీడు ఘడియల్లో మరణించారని, గ్రామానికి ఏదో కీడు సోకిందని గ్రామ ప్రజలు ఓ జ్యోతిషున్ని కలిశారు. అతను చెప్పిన సలహా మేరకు వారందరూ ప్రొద్దున నిద్ర లేచిన తరువాత ఇంట్లో ఎటువంటి పని చేయకుండా ఇంటికి తాళాలు వేసి అడవికి వెళ్లి అక్కడే వంట వార్పూ చేసుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. దీనివల్ల గ్రామం పగటిపూట నిర్మానుష్యంగా మారింది.