రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి....

SMTV Desk 2017-10-11 18:02:19  sangareddy highway accident, Malkapur

హైదరాబాద్, అక్టోబర్ 11 : సంగారెడ్డి రహాదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ దగ్గర గల ప్రధాన రహదారిపై నేటి మధ్యాహ్నం జహీరాబాద్ నుంచి వస్తున్న తుఫాన్ వాహనాన్ని డీసీఎం వ్యాన్ డీకోట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతులను జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామ వాస్తవ్యులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.