చెన్నై, అక్టోబర్ 11 : తమిళ సినీపరిశ్రమ నటుడు సంతానం ఓ వ్యక్తిపై దాడి చేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. వివరాలలోకి వెళితే.. ప్రముఖ సినీ నటుడు సంతానం వళసరవాక్కం చౌదరి నగర్కు చెందిన షణ్ముగ సుందరంతో కలిసి కళ్యాణ మండప౦ నిర్మించాలని గతంలో నిర్ణయించుకున్నారు. దానికి సంబ౦ధి౦చి కొంత డబ్బును సంతానం షణ్ముగకు అందజేయగా, తరువాత కొన్ని కారణాల వల్ల ఆ నిర్మాణ నిర్ణయాన్ని ఇద్దరు విరమించుకున్నారు. దీంతో తన డబ్బు తిరిగి చెల్లించాలని కోరగా, కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వడంలో కాలయాపన చేశాడు షణ్ముగ సుందరం. దీంతో విసిగిపోయిన సంతానం, సోమవారం తన మేనేజర్ రమేష్తో కలిసి షణ్ముగ కార్యాలయానికి డబ్బుల విషయమై వెళ్ళగా, వాగ్వాదం ముదిరి గొడవకు దారి తీసింది. ఈ మేరకు షణ్ముగ పోలీసులను ఆశ్రయించగా, సంతానంపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు.