కంచ ఇలయ్య పై కేసు నమోదు

SMTV Desk 2017-10-11 08:07:29  kancha ilaiah, samajika smaglurlu komatollu, kancha ilaiah book, case filed on ilaiah

హైదరాబాద్ అక్టోబర్ 11: హిందువుల మనోభావాలు దెబ్బతినేల కంచ ఇలయ్య మాట్లాడారని ఆరోపిస్తూ తిరుమలనగర్ కు చెందిన కె.నాగరాజ్ అనే దళిత యువకుడు కోర్టు ను ఆశ్రయించాడు. ఈ నేపథ్యం లో విచారించిన కోర్టు ప్రొఫెసర్ కంచ ఇలయ్య పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి న్యాయస్థానం ఉత్తర్వులు జారి చేసింది. ఓ ఛానల్ లో నిర్వహించిన చర్చ కార్యక్రమం లో వాదనలు విన్న కోర్టు ఆయనపై సెక్షన్ 153 ఏ, 153బీ, 295ఏ, ఐపీసీ 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని, వచ్చే నెల 10వ తేదీలోగా ఓ నివేదిక సమర్పించాలని మల్కాజ్ గిరి పోలీసులను ఆదేశించింది. కంచ ఇలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కొమటోల్లు’ అనే పుస్తకం రాయడం వల్లనే నిరసనలు, ఆందోళనలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయని తెలిసిందే. ఈ పుస్తకాన్ని నిషేధించాలని ఆర్యవైశ్యులు డిమాండ్ చేస్తున్నారు.