హైదరాబాద్, అక్టోబర్ 09 : యువత అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని వారధి ఫౌండేషన్ అందిస్తున్నట్లు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సేవలని అందిస్తున్న సంస్థలకు, తల్లిదండ్రులు కందా భీమశంకరం, పాపాయమ్మ పేరిట స్మారక పురస్కారాలను ఆయన అందజేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలైన ఇప్పటికీ కొన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య అంటే కేవలం చదువే కాదని ఆటలు, పాటలు, చిత్రలేఖనం, క్రీడలు సైతం ఇందులో భాగమని లోక్ సత్తా వ్యవస్థాపకులు డా. జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన వ్యాస రచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచినా వారికి నేడు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు, ప్రధాన కార్యదర్శి ఎన్.వి.ఎల్.నాగరాజు, సంయుక్త కార్యదర్శి అశోక కుండలియ, కోశాధికారి కె.ఎస్.గోపాల్ తదితరులు హాజరయ్యారు.