హైదరాబాద్ అక్టోబర్ 7: ‘స్పైడర్’ చిత్రం తో అలరించిన రకుల్ ప్రీత్ సింగ్, ఈ మధ్యే తిరుపతిలో వీవీ మహల్ రోడ్డులో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళింది. షాపింగ్ మాల్ దగ్గర రకుల్ ను చూడడానికి చాలా మంది అభిమానులు వచ్చారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఏపీ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి కూడా విచ్చేసారు. రకుల్ ఈ షోరూంను ప్రారంభించగా, అమరనాథరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ, ‘శ్రీవారి పాదాల చెంత సంప్రదాయ వస్త్ర లయాన్ని ఏర్పాటు చేశారని, శారీస్, టెక్స్టైల్స్, రెడీమేడ్స్, అన్ని రకాల వస్త్రాలు, వన్ గ్రాము జ్యుయలరీని ఈ షాపింగ్ మాల్ వారు అందుబాటులో ఉంచారని’ చెప్పింది. అలాగే అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. ఈ షాపింగ్ మాల్లో అన్ని వర్గాల ప్రజలకు సరసమైన ధరలకే వస్త్రాలు అందిస్తున్నారని చెప్పారు.