హైదరాబాద్, అక్టోబర్ 07 : తెలంగాణ సింగరేణి ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకున్న తెరాస ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికలను ప్రలోభపెట్టడంతో పాటు అధికార పార్టీ యూనియన్కు ఓటు వేయాలని ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీలతో పాటు కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడి అక్రమ ఓట్లు వేయించారని, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటిని అమలు చేయాలని అధికార పార్టీని కోరారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.