ఎంపీ కవితకు కేటీఆర్ అభినందనలు..

SMTV Desk 2017-10-06 12:02:19  Singareni elections, Telangana coal mine chairperson, mp kavitha, minister ktr.

హైదరాబాద్, అక్టోబర్ 6 : సింగరేణి కార్మిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన తెరాస బొగ్గుగని కార్మిక సంఘానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. నిన్న జరిగిన టీబీజీకేఎస్‌(తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం) ఎన్నికల్లో తెరాస విజయాన్ని ఎన్ని ప్రతిపక్షాలు ఎదురించినా.. విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారని అన్నారు. ఈ విజయానికి ఎంతగానో కృషి చేసిన ఎంపీ కవితకు.. కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లలో తొమ్మిది స్థానాలలో టీబీజీకేఎస్‌ విజయ పతకం ఎగురవేయడం విశేషం. మిగిలిన రెండు డివిజన్లలో ఏఐటీయూసీ కూటమి గెలుపు సాధించింది.