హైదరాబాద్, సెప్టెంబర్ 26: హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఎస్పీ రత్నకుమారి కుమారుడు రోషన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిద్ర మాత్రలు వేసుకొని మంచంపై నుంచి కింద పడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా రోషన్ ఐదేళ్లుగా మానసిక ఒత్తిడిలో ఉన్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన పంజాగుట్ట ఐఏఎస్, ఐపీఎస్ కాలనీలో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.