హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఆది అక్షర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సదానంద రెడ్డి దర్శకత్వ౦లో ‘దళపతి’ సినిమా తెరకేక్కబోతుంది. ఈ చిత్రంలో సదా, కవితా అగర్వాల్, బాబు, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్యానికి రాజెంతో దళపతి అంతే అవసరం. సైన్యాన్ని ముందుండి నడిపే దళపతి రాజ్యానికి వెన్నుదన్ను. మరి మా ‘దళపతి’ ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాలంటున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు సదానంద రెడ్డి మాట్లాడుతూ..." విభిన్న కథాంశంతో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాకు జై సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దళపతి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాడని’ అని అన్నారు. ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి హీరో, హీరోయిన్ల పేర్లను చెప్పకపోవడం విశేషం.