హైదరాబాద్, సెప్టెంబర్ 19: బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ పేరు ఇప్పటిదాకా బాలీవుడ్, ఇప్పటి నుంచి టాలీవుడ్ తో పాటు దేశమంతా మార్మోగిపోతుంది. దీనికి కారణం ఆమె చేస్తున్న సినిమాలే...మొదటగా బాలీవుడ్ లో (2010) తీన్పత్తి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి...ఆ తర్వాత 2013లో వచ్చిన ‘ఆషికీ’ చిత్రంతో బ్లాక్బస్టర్ అందుకుంది ఈ అమ్మడు. అనంతరం తాను నటించిన అన్నీ సినిమాలలోను మంచి పేరు సాధించుకొని కెరీర్లో ఉన్నతస్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం దావూద్ సోదరి బయోపిక్ ‘హసీనా పార్కర్’, సైనా నెహ్వాల్ బయోపిక్తో పాటు.. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్తో ‘సాహో’ చిత్రాల్లో నటిస్తోంది. తన కెరియర్ గురించి శ్రద్ధా మాట్లాడుతూ..." సినిమాలలో నటించడం అనేది నా చిన్ననాటి కలని ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలతో ఆ కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఇకముందు విభిన్నమైన పాత్రలతో రాణించడానికి నా వంతు కృషి చేస్తూనే ఉంటానన్నారు. ఈ సినీపరిశ్రమలో హార్డ్వర్క్కు దగ్గర దారులు ఉండవని చెప్పుకొచ్చింది ఈ సుందరి. అపూర్వ లఖియా దర్శకత్వంలో హసీనా పార్కర్ లాంటి చిత్రంలో నటించడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని హసీనా పాత్ర చాలా విభిన్నమైనది, మళ్లీ, మళ్లీ రాదని చెప్పింది.