వరంగల్ సెప్టెంబర్ 16: టీడీపీ పార్టీ ఆదేశిస్తే నల్గొండ లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధమని తెలంగాణ టీడీపీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాల విభజనతో రాష్ట్ర ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణాను కుక్కలు చింపిన విస్తరిలా కేసీఆర్ చేశారని అన్నారు. పార్టీ బలహీనపడిందనే భావంతో కొత్తగా రైతు సమితులను ఏర్పాటు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెరాసపై ధ్వజమెత్తారు. రైతు సమన్వయ సమితుల్లో సభ్యులందరూ టీఆర్ఎస్ కు చెందిన వాళ్లే ఉన్నారని, సమగ్ర సర్వే సందర్భంగా వారికి సహకరించొద్దని రైతులకు సూచించారు. సమితుల పేరుతో వచ్చే టీఆర్ఎస్ నేతలను చెట్లకు కట్టేయాలని పిలుపునిచ్చారు. జిల్లాల విభజనతో రాష్ట్ర ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టారని మండిపడ్డారు.