చైతూ తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో భారీ నష్టం..

SMTV Desk 2017-09-15 15:26:51  AKKINENI NAGA CHAITANYA, YUDDAM SHARANAM MOVIE, NAGARJUNA.

హైదరాబాద్, సెప్టెంబర్ 15 : "రారండోయ్ వేడుక చూద్దాం" సినిమాతో మంచి హిట్ ను అందుకున్న హీరో అక్కినేని నాగచైతన్య అదే ఫాంలో "యుద్ధం శరణం" సినిమా చేశాడు. కాని ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణను పొందలేక పోయింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సాయి కొర్రపాటికి 11 కోట్ల వరకూ నష్టం వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణ మారిముత్తు నాగచైతన్యకు స్నేహితుడు కావడంతో ఎలాగైనా తనతో కలిసి ఒక సినిమా చేయాలని చైతన్య భావించాడట. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాల్లో నాగార్జున జోక్యం చేసుకోకపోవడంతో ఈ సినిమా పరాజయం పాలైందని అంతా అనుకుంటున్నారు. చైతూ తీసుకున్న ఈ తొందర పాటు నిర్ణయం వల్ల ఆయనకు రావలసిన హిట్ రాకుండా పోయిందనే భావంతో ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.