ముంబై సెప్టెంబర్ 14: బాలీవుడ్ లో విద్యాబాలన్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది, తన నటన తో విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇపుడు మళ్ళి కథానాయిక ప్రాధాన్యం చిత్రం ‘తుమారి సులు’ లో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విద్యాబాలన్ రేడియో జాకి గా, సాధారణ గృహిణి గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ‘ఐ యాం ఆర్జే సులు’ అంటూ విద్యాబాలన్ రేడియో జాకీలా మాట్లాడేస్తోంది. ఇందులో వినిపించిన ఆమె స్వరం అద్భుతంగా ఉంది. ఈ టీజర్లో విద్యాబాలన్ మాటతీరు అద్భుతంగా ఉందని నెటిజన్లు కితాబిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 42 రోజులలో పూర్తి చేసారు. సురేశ్ త్రివేణి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.