చెన్నై సెప్టెంబర్ 13: తెలుగు పరిశ్రమ లో సూర్య కి మంచి స్థానం ఉంది. అయన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతాయి. తాజాగా వచ్చిన ‘24’ సినిమా తమిళంలో కన్నా తెలుగులోనే బాగా ఆడింది. ప్రస్తుతం సూర్య విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘తానా సెరంద కొట్టమ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. ఇపుడు సూర్య తరువాతి చిత్రం సుధా కొంగర తో చేస్తున్నారని సమాచారం. సుధా కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇరుదుసుట్రు’, ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్రలో నటించారు. తరువాత ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్తో ‘గురు’గా రీమేక్ చేశారు. ఈ సినిమానే మొదట తమిళంలో, హిందీ లో ఏక కాలంలో తెరకెక్కించారు. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా సుధ కొత్త చిత్ర కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సూర్య హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్లో దీన్ని నిర్మిస్తారట. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.