హైదరాబాద్, సెప్టెంబర్ 12 : నాటికి నేటికి తెలుగు ప్రేక్షకులు మరిచి పోలేని నటీనటులు కొందరు ఉంటారు. ఆ కోవలోనే అలనాటి అందాల తార సావిత్రి ఒకరు. ఆమె జీవిత కథ ఆధారంగా తెరక్కేక్కుతున్న సినిమా మహానటి. ఈ సినిమాలో నటించాలని చాలామంది నటీనటులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అర్జున్ రెడ్డి మూవీ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలిని పాండేలు దీనిలో నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అంతే కాకుండా సమంత, దుల్కర్ సల్మాన్ లు కూడా కీలక పాత్రలలో నటిస్తునట్లు తెలిసింది. ఇప్పుడు తాజాగా మరో నటి ఎవడే సుబ్రహ్మణ్యం హీరోయిన్ మాళవిక నాయర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో మాళవికది గెస్ట్ రూల్ అని తెలిసింది. నాగ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమా షూటింగ్ బిజిబిజిగా సాగుతుంది.