హైదరాబాద్ సెప్టెంబర్ 11 : ‘జుమ్మంది నాదం’ చిత్రం తో తాప్సీ తెలుగులో పరిచయమైయ్యారు. కానీ ఆ చిత్రం తో తాప్సికి అంతగా గుర్తింపు రాలేదు, ‘ఆనందో బ్రహ్మ’ తో ఒక మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తెలుగు సినిమాల్లో అవకాశాలు సరిగ్గా లేవు, కానీ బాలీవుడ్ లో మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ దావన్ సరసన హీరోయిన్ గా నటించిన జుడ్వా 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న తాప్సీ, మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పింది. ఇప్పటికే పింక్, బేబి లాంటి సినిమాలతో బాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న తాప్సీ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో హాకీ ప్లేయర్ గా నటించనుందట. అందుకోసం ప్రత్యేకంగా హాకీ శిక్షణ తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్ర దర్శకుడు షాద్ అలీ, కాగా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.